Advertisement

అనారోగ్యంతో చిత్తూరు మాజీ ఎమ్యెల్యే మృతి...

By: Sankar Fri, 20 Nov 2020 07:13 AM

అనారోగ్యంతో చిత్తూరు మాజీ ఎమ్యెల్యే మృతి...


తెలుగుదేశం పార్టీలో మరో విషాదం నెలకొంది. టీడీపీ పార్టీ సీనియర్‌ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ గురువారం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యప్రభ బెంగుళూరు వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ క్రమంలోనే గురువారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951 సెప్టెంబర్‌ 21న జన్మించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆదికేశవులు నాయుడు మృతితో సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టీడీపీ తరఫున విజయం సాధించారు.

అనంతరం 2019 సాధారణ ఎన్నికల్లో రాజంపేట టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా.. ఇటీవలే సత్యప్రభ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. సత్యప్రభ మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. సత్యప్రభ మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు

Tags :
|
|
|

Advertisement