Advertisement

  • తెలుగు దేశ కార్యకర్తలను ఉర్రుతలూగించిన ఎస్పీ బాలు పాట..

తెలుగు దేశ కార్యకర్తలను ఉర్రుతలూగించిన ఎస్పీ బాలు పాట..

By: Sankar Fri, 25 Sept 2020 6:10 PM

తెలుగు దేశ కార్యకర్తలను ఉర్రుతలూగించిన ఎస్పీ బాలు పాట..


దిగ్గజ గాయకుడు, నటుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. బాలు మరణంపై ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

ఎస్పీబీ సినిమా పాటలే కాదు రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు కూడా పాడారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. తన గాత్రం ద్వారా పార్టీల కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. తెలుగు దేశం పార్టీ కోసం పాడిన ఓ పాట ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లలో ఉరకలెత్తిస్తుందనే చెప్పాలి.

టీడీపీ కోసం కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అంటూ సాగే ఆ పాట ఇప్పటికీ చాలా ఫేమస్. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. తెలుగు తమ్ముళ్లు మొబైల్స్‌లో కూడా మోగుతుంది.. చాలామందికి కాలర్ ట్యూన్‌గా ఉంది. బాలు మరణం తర్వాత.. ఆయన పాడిన కదలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా పాటతో పాటూ మిగిలిన వాటిని టీడీపీ నేతలు, కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ పాట ఎప్పటికీ తమ ఆల్‌టైమ్ ఫేవరెట్ అంటున్నారు.

Tags :
|

Advertisement