తిరుపతి ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసిన టిడిపి....
By: Sankar Mon, 16 Nov 2020 7:26 PM
తిరుపతి లోక్సభ వైకాపాకు చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందడంతో ఉపఎన్నిక జరగనుంది. ఈ క్రమములో తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఖరారు చేసింది.
టీడీపీ పార్టీ అభ్యర్థిగా మాజీ ఎంపీ పనబాక లక్ష్మి పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉపఎన్నికల్లో తెలుగుదేశం గెలుపునకు కృషి చేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నికపై టీడీపీ కసరత్తులు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్సభకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు.
Tags :
tdp |