కలైవానర్ అరంగంలో సెప్టెంబర్ 14 నుంచి 16 వరకు తమిళనాడు రాష్ట్ర శాసనసభ సమావేశాలు
By: chandrasekar Wed, 09 Sept 2020 09:21 AM
తమిళనాడు రాష్ట్ర శాసనసభ సమావేశాలు కలైవానర్ అరంగంలో సెప్టెంబర్ 14
నుంచి 16 వరకు జరగనున్నట్లు తెలిపారు. శాసనసభ సమావేశాల నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 14 నుంచి 16
వరకు తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. చెన్నైలోని కలైవానర్ అరంగంలో రాష్ట్ర శాసనసభ సమావేశాలు సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 16
వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. హౌస్ ప్రొసీడింగ్స్లో పాల్గొనడానికి ఇష్టపడే వారందరూ సభ ప్రారంభానికి 72 గంటల ముందు కొవిడ్-19
పరీక్షలు చేయించుకుని ఉండాలని సూచించారు.
ఈ సమావేశాలకు స్పీకర్ పీ ధనపాల్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సెషన్స్ తేదీలను ఖరారు చేశారు. సభ ప్రారంభం కాగానే సంతాప తీర్మానాలు, సంస్మరణలు ఉంటాయని తమిళనాడు స్పీకర్ ధనపాల్ చెప్పారు. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే అన్బయగన్, మాజీ ఎంపీ వసంత్కుమార్, రాష్ట్రంలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు సభలో సంతాపం తెలుపనున్నట్లు స్పీకర్ తెలిపారు. సంతాపాల అనంతరం మృతులకు గౌరవ సూచకంగా సభను వాయిదా వేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వానికి వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.