తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 5,63,691 గాను మరణాల సంఖ్య 9,076 గా నమోదు
By: chandrasekar Fri, 25 Sept 2020 08:47 AM
దేశంలో కరోనా రోజురోజుకి
పెరుగుతూ వుంది. ఈ క్రమంలో తమిళనాడులోని కొత్త కేసులు ప్రతి రోజు సరాసరిగా ఐదు
వేలకు పైగా నమోదవుతున్నాయి. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 5.6
లక్షలను దాటగా మరణాలు 9 వేలు దాటాయి. ప్రతి రోజు కొత్తగా ఐదు వేలకుపైగా
కరోనా కేసులు 50కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. బుధవారం నుంచి
గురువారం వరకు కొత్తగా 5,692 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో వయసు పైబడ్డ
వారు ఎక్కువగా మరణించినట్లు తెలుస్తుంది.
వైరస్ బారినపడిన వారిలో 66 మంది
మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,63,691కు, మరణాల
సంఖ్య 9,076కు
చేరింది. గత 24 గంటల్లో 5,470 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దీంతో ఇప్పటి వరకు 5,08,210 మంది కోలుకోగా ప్రస్తుతం 46,405 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కోలుకున్న వారి శాతం చూస్తే ఎక్కువగానే
ఉన్నట్లు తెలుస్తుంది.