Advertisement

  • తమిళనాడు ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం పళనిస్వామి

తమిళనాడు ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం పళనిస్వామి

By: Sankar Mon, 21 Dec 2020 6:18 PM

తమిళనాడు ప్రజలకు సంక్రాంతి కానుక ప్రకటించిన సీఎం పళనిస్వామి


తమిళనాడు లో సంక్రాంతి కి రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించింది..అందులో భాగంగా రేషన్‌ కార్డు లబ్దిదారులకు సంక్రాంతి కానుకగా రూ.2500 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

సీఎం నిర్ణయంతో తమిళనాడులోకి 2.06 కోట్ల రేషన్‌కార్డు దారులు లబ్ది పొందనున్నారు. 2500 రూపాయలతో పాటు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక చెరుకు గడ, 20 గ్రాముల కిస్‌మిస్‌, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాములుయాలకులు కూడా ఉచితంగా అందివ్వనున్నట్టు సీఎం తెలిపారు.

కాగా, ముఖ్యమంత్రి ప్రకటనపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విమర్శలు చేశారు. వరదల సమయంలో ప్రజలు కష్టాల్లో​ఉన్నప్పుడు ఎటువంటి సాయం అందించని సీఎం, ఎన్నికలు సమీపిస్తుండటంతో వరాలు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్‌, వరదల కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు రూ.5000 చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Tags :
|

Advertisement