Advertisement

  • రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా కరోనా వాక్సిన్ వేయిస్తాము ..తమిళనాడు సీఎం సంచలన ప్రకటన

రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా కరోనా వాక్సిన్ వేయిస్తాము ..తమిళనాడు సీఎం సంచలన ప్రకటన

By: Sankar Thu, 22 Oct 2020 7:25 PM

రాష్ట్ర ప్రజలందరికి ఉచితంగా కరోనా వాక్సిన్ వేయిస్తాము ..తమిళనాడు సీఎం సంచలన ప్రకటన


దేశంలో ఈ రోజు ఫ్రీ కరోనా వ్యాక్సిన్ న్యూస్ మోత మోగిపోతుంది ..బీహార్ ఎలెక్షన్ల నేపథ్యంలో బీహార్ ప్రజలకు ఫ్రీ గా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని బిజెపి ప్రకటన చేసిన కొద్దీ గంటల్లోనే మరో రాష్ట్ర ముఖ్యంమత్రి కూడా తమ రాష్ట్ర ప్రజలందరికి ఫ్రీ గ కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని ప్రకటించాడు..రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. దేశంలో ఇలాంటి ప్రకటన చేసిన తొలి సీఎంగా నిలిచారు.

కొవిడ్ టీకా వ‌చ్చిన వెంటనే దాన్ని రాష్ట్ర ప్రజ‌లందరికీ ఉచితంగా వేయిస్తాం’ అని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేర్కొన్నారు. గురువారం ‘అక్టోబర్ 22’ సాయంత్రం ఈ ప్రకటన చేశారు. వ‌చ్చే ఏడాది ఆరంభంలో త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగనున్నాయి.

మరోవైపు.. ఫ్రీ కరోనా వ్యాక్సిన్‌పై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికలు వస్తున్నాయనగానే ఓటర్లను ఆకర్షించుకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తారని విమర్శిస్తున్నారు. ఓటు వేస్తే టీకా ఇస్తారా అంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ’ అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

Tags :
|
|

Advertisement