Advertisement

  • కరోనాతో మృతి చెందిన తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి

కరోనాతో మృతి చెందిన తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి

By: Sankar Sun, 01 Nov 2020 2:48 PM

కరోనాతో మృతి చెందిన తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి


తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి దురైక్కన్ను(72) కన్నుమూశారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్వాస ఇబ్బందులతో గత నెల 13న చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో దురైక్కన్ను చేరారు.

అనంతరం అక్కడి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఆరోగ్యం మరింత విషమించింది. ఈ క్రమం‍లోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.

ఈ మేరకు వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మంత్రి మృతిపట్ల తిమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement