హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తమన్నా
By: chandrasekar Wed, 07 Oct 2020 2:03 PM
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా
కరోనా బారిన పడి ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అయితే
తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపింది. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా
ట్విట్టర్ వేదిక ద్వారా ఓ ప్రకటనను విడుదలచేసి అభిమానులకు షేర్ చేసింది. షూటింగ్లో
ఉన్నపుడు సెట్లో అందరం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని కానీ, గతవారం
తనకు తేలికపాటి జ్వరం వస్తే పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్గా వచ్చిందని మిల్కీ బ్యూటీ చెప్పి౦ది.
వైద్యుల సూచన మేరకు వెంటనే హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి
చికిత్స పొందానని తమన్నా పేర్కొంది. ప్రస్తుతం తనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
చేశారని హోం క్వారంటైన్లో ఉన్నానని తెలిపింది.
ప్రపంచంలోని చాలా మంది
కరోనాతో ఇబ్బంది పడుతుండగా తాను పూర్తిగా కోలుకోవడం అదృష్టమేనని తన ఆరోగ్యం కోసం
ప్రార్థించిన అభిమానులకు, సన్నిహితులకు ధన్యవాదాలు అంటూ ట్విట్ చేసింది తమన్నా.
కొన్ని రోజుల కిందట తమన్నా తల్లిదండ్రులకు కూడా కరోనా పాజిటివ్గా తేలింది. కొందరు
సిబ్బందికి సైతం కరోనా పాజిటివ్గా తేలగా తమన్నాకు మాత్రం అప్పుడు నెగిటివ్
వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమన్నా
గోపీచంద్తో కలిసి 'సీటీమార్' చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాకు సంపత్ నంది
దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు దట్ ఈజ్ మహాలక్ష్మి, మరో
హిందీ సినిమా ప్రాజెక్టును కూడా ఒప్పుకుంది ఈ మిల్కీ బ్యూటీ.