Advertisement

  • జీహెచ్ ఎంసి ఎన్నికలపై తలసాని కీలక వ్యాఖ్యాలు...

జీహెచ్ ఎంసి ఎన్నికలపై తలసాని కీలక వ్యాఖ్యాలు...

By: chandrasekar Mon, 02 Nov 2020 4:19 PM

జీహెచ్ ఎంసి ఎన్నికలపై తలసాని కీలక వ్యాఖ్యాలు...


తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ ఎంసి ఎన్నికల గురించి మాట్లాడుతూ...

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 150 సీట్లలో 104 సీట్లను కైవసం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం రోజు మీడియాతో మాట్లాడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ కోసం కేంద్రం వెంటనే రూ.1,000 కోట్లు సహయం చేయాలి అని ఆయన కోరారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అన్నిరకాల సహాయం అందుతుంది అని తెలిపారు తలసాని.

ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్, బీజేపీ వద్ద సరైన అభ్యర్థులు లేరు అని చెప్పారు. ఎన్నికలు ఏవి అయినా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజేతగా నిలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. గోబెల్స్ ప్రచారంతో దుబ్బాక ఎన్నికలను గెలవడానికి బీజేపి ప్రయత్నిస్తోంది అని పేర్కొన్నారు. సోమవారం రోజు దుబ్బాక బై ఎలక్షన్స్ జరగనుంది.


Tags :
|

Advertisement