Advertisement

ఏపీ కేడర్ కు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి...!

By: Anji Sat, 12 Dec 2020 6:13 PM

ఏపీ కేడర్ కు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి...!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఏపీ కేడర్కు రిపోర్టు చేశారు. తెలంగాణ నుంచి ఏపీ కేడర్ డిప్యుటేషన్కు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చింది.

ఏపీ సాధారణ పరిపాలన శాఖకు శ్రీలక్ష్మి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం త్వరలోనే శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి...డిప్యుటేషన్పై ఏపీకి వచ్చేందుకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఆమె తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి కీలక పదవుల్లో పనిచేశారు.

అనంతరం ఓబులాపురం గనుల వ్యవహారంలో చిక్కుకుని సీబీఐ తాఖీదులు పొందారు. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మి... రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ కేడర్ను ఎంచుకున్నారు. అనంతరం తిరిగి ఏపీ కేడరుకు డిప్యుటేషన్పై వచ్చేందుకు దరఖాస్తు చేశారు.

Tags :

Advertisement