నెపోటిజం వలన తాను పడ్డ ఇబ్బందులని ఓ ఇంటర్వ్యూలో తెలిపిన తాప్సీ
By: chandrasekar Tue, 07 July 2020 11:40 AM
గతంలో నెపోటిజం బారినపడ్డ కొందరు సెలబ్రిటీలు తాము బాధితులమంటూ
చెప్పుకొస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత నెపోటిజంపై చర్చలు
నడుస్తున్నాయి. తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ నెపోటిజం వలన తాను పడ్డ
ఇబ్బందులని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఈ ఇబ్బందులకి ప్రేక్షకులు కూడా ఓ
కారణమంటూ సంచలన ఆరోపణలు చేసింది.
సినీ పరిశ్రమలో వారసులకి
అవకాశాలు సులభంగా వస్తాయి. ఎలాంటి సినీ నేపథ్యంలేని వాళ్ళు మాత్రం చాలా ఆలస్యం
అవుతుంది. వారు ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడానికి చాలా ఏళ్లు పడతాయి. దర్శకులు
కూడా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల వారసులకే ఎక్కువగా అవకాశాలు ఇస్తారు. ఈ క్రమంలోనే
నేను మొదట్లో చాలా అవకాశాలు కోల్పోయాను.
అప్పట్లో నేను అనుభవించిన
బాధ మాటలలో చెప్పలేనిది. ఈ బాధకి ప్రేక్షకులు కూడా కారణం అని చెప్పవచ్చు.
ఎందుకంటే బయట నుండి వచ్చిన వారి సినిమాల కంటే వారసుల సినిమాలని చూసేందుకు
ఎక్కువగా ఆసక్తి చూపుతారు అని తాప్సీ స్పష్టం చేసింది.