గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చిరంజీవి కుమార్తె సుస్మిత
By: chandrasekar Wed, 22 July 2020 4:57 PM
గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు
సినీ పరిశ్రమ నుంచి భారీ మద్దతు లభిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది
సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ను స్వీకరించి మొక్కలు నాటారు. ఈ ఛాలెంజ్కు మరో ముగ్గురు
సెలబ్రిటీలను నామినేట్ చేయడం ద్వారా ఈ మంచి కార్యక్రమాన్ని ముందుకు
తీసుకెళ్తున్నారు.
ఇటీవల గ్రీన్ ఇండియా
ఛాలెంజ్లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి మెగాస్టార్ చిరంజీవి పెద్ద
కుమార్తె సుస్మితా కొణిదెలను నామినేట్ చేశారు. శిల్పా రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ను
స్వీకరించిన సుస్మితా కొణిదెల తన భర్త విష్ణుప్రసాద్తో కలిసి ఈరోజు జూబ్లీహిల్స్లోని
తమ కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ
‘‘మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఇష్టమైన పని అయిన మొక్కలు నాటడంను మాతో
చేయించినందుకు సంతోష్ గారికి కృతజ్ఞతలు.
కరోనా వైరస్ ప్రభావం వల్ల
లాక్డౌన్ సమయంలో ఏదైనా మంచి పని చేశాం అంటే అది ఈరోజు ఈ మొక్కలు నాటడమే’’ అని
అన్నారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఇంకా పెద్ద ఎత్తున అందరూ ముందుకు
తీసుకువెళ్లి బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని రక్షిస్తే మనకు ఆక్సిజన్, నీడను
ఇస్తాయని సుస్మిత తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురిని ఈ ఛాలెంజ్ స్వీకరించాలని
సుస్మిత కోరారు. తన చెల్లెలు శ్రీజ, తమ కుటుంబ సభ్యురాలు అల్లు స్నేహా రెడ్డి, స్వప్న
దత్లను ఈ ఛాలెంజ్కు సుస్మిత నామినేట్ చేశారు.