మంచు లక్ష్మి ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుశాంత్ సింగ్ ఫ్యామిలీ
By: Sankar Tue, 01 Sept 2020 10:44 AM
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం మీద రోజుకు ఒక వార్త వస్తూనే ఉన్నాయి..అయితే సుశాంత్ మరణాన్ని సిబిఐ విచారణ చేస్తుండటంతో నిజనిజాలు బయటకు వస్తాయి అని అందరు భావిస్తున్నారు ..అయితే సుశాంత్ హత్యా కేసులో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నది సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా ప్రచరంలో ఉన్న రియా చక్రవర్తి..
అయితే నిజనిజాలు తెలియకుండా రియాని దోషిని చేయోద్దంటూ వారు వాపోతున్నారు. ఇదే క్రమంలో మంచు లక్ష్మీ కూడా ఈ ఇష్యూపై స్పందించింది. జస్టిస్ట్ ఫర్ రియా, జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అంటూ పోస్ట్ పెట్టింది. రియా దోషిగా తేలక ముందు ఆమెని దోషిని చేయవద్దు. ప్రతి ఒక్కరు సత్యమేదో తెలిసే వరకు సంయమనం పాటించాలి.నిజనిజాల నిర్ధారణ కాకుండా రియా కుటుంబంపై ఆరోపణలు చేయడం తగదంటూ లక్ష్మీ ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ని తాప్సీతో పాటు పలువురు ప్రముఖులు రీ ట్వీట్ చేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వచ్చి రియాకి సపోర్ట్గా మాట్లాడుతుండడంతో సుశాంత్ మేనకోడలు మల్లికా సింగ్.. ఆశ్చర్యంగా ఉంది, సినీ కుటుంబం, సహా నటులు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్న వారు ఇంతకముందు ఏమయ్యారో అంటూ మల్లికా రాసుకొచ్చింది. దీనికి సుశాంత్ సోదరి శ్వేతా ఇది నిజం అని బదులిచ్చింది.