Advertisement

  • సుశాంత్ సింగ్ మరణం: ఆత్మహత్యే అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడి

సుశాంత్ సింగ్ మరణం: ఆత్మహత్యే అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడి

By: chandrasekar Tue, 16 June 2020 11:38 AM

సుశాంత్ సింగ్ మరణం: ఆత్మహత్యే అని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడి


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముంబైలోని తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు సుశాంత్. అయితే ఆయనది ఆత్మహత్య కాదని, హత్య చేశారని, ఈ మరణం వెనుక ఏదో కుట్ర దాగివుందని పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా బయటకొచ్చిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆయనది ఆత్మహత్యే అని, ఇంట్లోని ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కన్ఫర్మ్ చేసేసింది. ముంబై లోని జూహూ ప్రాంతంలో ఉన్న కూపర్ హాస్పిటల్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ నిర్వహించారు. డెడ్ బాడీకి కరోనా పరీక్షలు సైతం చేసి నెగెటివ్ అని నిర్దారించారు. గత రాత్రి జరిగిన ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్‌ని సోమవారం ఉదయం మీడియా ముందుంచారు. ఈ రిపోర్ట్ ప్రకారం సుశాంత్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తోంది..

గత 6 నెలలుగా సుశాంత్ డిప్రెషన్‌లో ఉండి ప్రాణాలు తీసుకున్నారని ముంబై పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. సుశాంత్ మేనేజర్ దిశా సైతం వారం క్రితమే సూసైడ్ చేసుకోవడం జరిగింది. సుశాంత్ డెత్ మిస్టరీని ఛేదించడంలో భాగంగా ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు 34 యేళ్ల వయసులోనే సుశాంత్ జీవితం అర్దాంతరంగా ముగియడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేక పోతున్నారు. మంచి భవిష్యత్ ఉన్న యాక్టర్ మరణం తమను తీవ్రంగా కలచివేసిందంటూ పలువురు టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఈ మేరకు సుశాంత్ ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

Tags :
|

Advertisement