Advertisement

  • సూసైడ్ ఆర్ మర్డర్ మూవీతో సెట్స్‌పైకి రానున్న సుశాంత్ రియల్ స్టోరీ

సూసైడ్ ఆర్ మర్డర్ మూవీతో సెట్స్‌పైకి రానున్న సుశాంత్ రియల్ స్టోరీ

By: chandrasekar Tue, 21 July 2020 12:10 PM

సూసైడ్ ఆర్ మర్డర్ మూవీతో సెట్స్‌పైకి రానున్న సుశాంత్ రియల్ స్టోరీ


సుశాంత్‌ది హత్యే అంటూ అతడి అభిమానులు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ పరిశ్రమలో ఓ సంచలనం సృష్టించింది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదు. బాలీవుడ్‌లోనూ కొంతమంది ప్రముఖులు సుశాంత్ ఆత్మహత్యపై సందేహాలు లేవనెత్తారు.

సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా ఇంకొంత మంది డిమాండ్ చేశారు. ఈ వివాదంలో సల్మాన్ ఖాన్, కరణ్ జొహర్, మహేష్ భట్, అర్జున్ కపూర్, ఆలియా భట్ లాంటి వాళ్లు ఎంతో మంది నెపోటిజంను ప్రోత్సహిస్తున్న వారిగా ఆరోపణలు ఎదుర్కొన్నారు.

బాలీవుడ్ పరిశ్రమలో ఎన్నో వివాదాలకు, సోషల్ మీడియాలో ఎన్నో చర్చలకు దారితీసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై తాజాగా ఓ సినిమా సైతం సెట్స్‌పైకి వెళ్లనుంది. శామిక్ మౌలిక్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాకు సూసైడ్ ఆర్ మర్డర్ అనే టైటిల్‌ని సైతం ఖరారు చేశారు. ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పాత్రలో ఉత్తర్ ప్రదేశ్ రాయ్ బరేలీకి చెందిన సచిన్ తివారి నటించనున్నాడు. తాజాగా సూసైడ్ ఆర్ మర్డర్ మూవీ ఫస్ట్‌లుక్ సైతం విడుదల చేశారు.

సూసైడ్ ఆర్ మర్డర్ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సచిన్ తివారి అచ్చం సుశాంత్‌నే పోలి ఉంటాడు. సుశాంత్ మరణం తర్వాత ఈ టిక్ టాక్ స్టార్ మరింత లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అందుకే సుశాంత్ పాత్రలో అతడినే తీసుకున్నారు.

Tags :
|
|

Advertisement