కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడి...
By: chandrasekar Thu, 22 Oct 2020 3:05 PM
కేరళ గొల్డ్ స్మగ్లింగ్
కేసులో ప్రధాన నిందితుడు అయిన సందీప్ నాయర్
ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపాడు. యూఏఈ కాన్సులేట్ జనరల్ లో సెక్రటరీగా
విధులు నిర్వర్తించే సమయంలో స్వప్న సురేష్ కమిషన్ తీసుకుని బంగారం స్మగుల్
చేయడానికి అంగీకరించింది అని చెప్పాడు. ఒక కిలో బంగారానికి రూ. 45000
కమిషన్ తీసుకుని దౌత్యవేత్తలకు అందించే ప్రత్యేక బ్యాగేజ్ సదుపాయంలో తరలించడానికి
వారి మధ్య ఒప్పందం కుదిరి౦దట. అయితే రూ.45 వేల కమిషన్ ఇస్తామన్నా సరిపోదు అని స్పప్న సురేష్
తెలిపిందట. ఈ కేసులో మరో నిందితుడు అయిన కేటీ రమీస్ స్మగ్లింగ్ చేసే కొత్త విధానాలను
వెతుకుతూ ఉండేవాడట.
ఈ విషయం గురించి తెలిపిన
సందీప్ నాయర్ నాకు సరితా, రీమస్ చాలా కాలం నుంచి తెలుసు అని. స్వప్నను నాకు
సరితా పరిచయం చేసింది అని చెప్పాడు. ఎంఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తో సందీప్ ఈ
విషయాలు తెలిపినట్టు సమాచారం. స్వప్న సురేష్ కు ఉన్న డిప్లమాటిక్ బ్యాగేజ్
సదుపాయంతో బంగారం అక్రమ రవాణా చేయడం చాలా
సులభం అని సరితా చెప్పిందని అని వెల్లడించాడు. 2019లో సరితా కారు ద్వారా
తొలిసారి అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించారని అన్నాడు. ఈ విషయం గురించి
ముఖ్యమంత్రి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్ కు తెలుసు అని చెప్పాడు. ఇంతా
తెలిసినా ఆమెను పదోన్నతికి ప్రోత్సాహించాడు అని నాయర్ తెలిపాడు.