Advertisement

  • బ్రేకింగ్ న్యూస్: ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్

బ్రేకింగ్ న్యూస్: ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్

By: Anji Sat, 29 Aug 2020 1:02 PM

బ్రేకింగ్ న్యూస్: ఐపీఎల్‌ నుంచి సురేశ్‌ రైనా ఔట్

ఐపీఎల్ 2020 నుంచి చైన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా హఠాత్తుగా నిష్క్రమించాడు. ‘‘వ్యక్తిగత కారణాల’’ వల్ల రైనా భారత్‌కు తిరిగి వచ్చాడనీ... ఈసారి ఐపీఎల్‌లో అతడిని మిస్ అవుతున్నామని సీఎస్‌కే జట్టు యాజమాన్యం ప్రకటించింది. రైనా, అతడి కుటుంబ సభ్యులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు తెలిపింది.

ఇవాళ ట్విటర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ క్లబ్ స్పందిస్తూ.. ‘‘వ్యక్తిగత కారణాల వల్ల సురేశ్ రైనా భారత్ తిరిగి వచ్చేశాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అందుబాటులో ఉండడు. ఈ సమయంలో సురేశ్, అతడి కుటుంబానికి చైన్నై సూపర్ కింగ్స్ సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తుంది..’’ అని పేర్కొంది.

మరోవైపు ఐపీఎల్‌ 2020లో భాగంగా అందరికంటే ముందు ప్రాక్టీస్‌ మొదలుపెట్టాలని భావించిన సీఎస్‌కేకు వరస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఒక బౌలర్‌తో పాటు పలువురు స్టాఫ్‌ మెంబర్స్‌కు కరోనా వైరస్‌ సోకింది. సీఎస్‌కే టీంలో దాదాపు 10 మంది కరోనాతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

Advertisement