Advertisement

  • ధోనితో పాటు రిటైర్మెంట్ ప్రకటించడంపై పెదవి విప్పిన రైనా

ధోనితో పాటు రిటైర్మెంట్ ప్రకటించడంపై పెదవి విప్పిన రైనా

By: Sankar Mon, 17 Aug 2020 7:42 PM

ధోనితో పాటు రిటైర్మెంట్ ప్రకటించడంపై పెదవి విప్పిన రైనా


క్రీడాభిమానులను షాక్‌కు గురిచేస్తూ టీమిండియా సీనియర్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, సురేశ్ రైనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆగస్టు 15న ఇద్దరూ తమ రిటైర్మెంట్లను ప్రకటించారు. ధోనీ ప్రకటన చేసిన వెంటనే రైనా రాజీనామా ప్రకటించడంతో రాముడికి తోడు లక్ష్మణుడు అంటూ కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ధోనీ రాజీనామా విషయం అందరూ ఊహించిందే అయినా... ఎప్పుడు చేస్తాడో తెలియక కాస్త గందరగోళానికి గురయ్యారు. కానీ సురేశ్ రైనా మాత్రం ఎవరూ ఊహించని విధంగా ధోనీ చేసిన రోజే రాజీనామా ప్రకటన చేశారు. దీని వెనక కారణం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్న వేళ.. సురేశ్ రైనా పెదవి విప్పాడు.

ధోనీ జెర్సీ నంబర్ 7 అని, తన జెర్సీ నంబర్ 3 అని రెండూ కలిపితే 73 వస్తుందన్నాడు. అలాగే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదితో 73 ఏళ్లు పూర్తయ్యాయని.. అందుకే తాను అదే రోజు రాజీనామా ప్రకటన చేశానని చెప్పుకొచ్చాడు. ధోనీ, రైనా దాదాపు ఒకేసారి అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో ధోనీ ఆరంగేట్రం చేస్తే.. 2005లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో రైనా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు.


Tags :
|
|

Advertisement