Advertisement

  • రెండో ఇన్నింగ్స్ ఆరంబించనున్న స్టార్ క్రికెటర్ సురేష్ రైనా

రెండో ఇన్నింగ్స్ ఆరంబించనున్న స్టార్ క్రికెటర్ సురేష్ రైనా

By: Sankar Tue, 22 Sept 2020 3:26 PM

రెండో ఇన్నింగ్స్ ఆరంబించనున్న స్టార్ క్రికెటర్ సురేష్ రైనా

భారత ఆటగాడు సురేష్ రైనా గత నెల 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు రైనా కాశ్మీర్ లో యువ క్రికెటర్లకు సహాయం అందించడానికి ముందుకు వచ్చాడు. అందుకోసం ఇప్పటికే అక్కడి స్థానిక అధికారులతో చర్చలు జరిపిన రైనా రాష్ట్రం లోని క్రీడాకారుల ప్రతిభను బయటికి తీసుకు రావడానికి కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాడు.

ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ డీసీపీ దిల్బాగ్ సింగ్ ను కలిసిన రైనా తన ఆలోచనలను ఆయనకు వివరించాడు. రైనా జమ్మూ కాశ్మీర్ ఆటగాళ్ల పై అంత శ్రద్ధ చూపించడానికి కారణం.. రైనా కుటుంబం చాలా ఏళ్ళ క్రితం కాశ్మీర్ నుండే వచ్చి ఉత్తర ప్రదేశ్ లో స్థిరపడినట్లు తెలుస్తుంది. అయితే ఐపీఎల్ లో స్టార్ ఆటగాళ్లలో రైనా ఒకడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో రైనా ఉన్నాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంతలా విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర పోషించిన రైనా ఈ ఏడాది ఆ జట్టునుండి తప్పుకున్నాడు. దాంతో అప్పుడు ఈ విషయం పై చాలా వార్తలు వచ్చాయి. కానీ అతను మళ్ళీ ఈ ఏడాది ఐపీఎల్ లో ఆడేందుకు వస్తాడు అని ప్రచారం జరిగిన అది నిజం కాలేదు.

Tags :
|

Advertisement