Advertisement

  • నెట్స్‌లో సురేశ్ రైనా, రిషబ్ పంత్ లు ప్రాక్టీస్ స్టార్ట్ చేసారు

నెట్స్‌లో సురేశ్ రైనా, రిషబ్ పంత్ లు ప్రాక్టీస్ స్టార్ట్ చేసారు

By: chandrasekar Tue, 14 July 2020 6:03 PM

నెట్స్‌లో సురేశ్ రైనా, రిషబ్ పంత్ లు ప్రాక్టీస్ స్టార్ట్ చేసారు


భారత క్రికెటర్లు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు నాలుగు నెలల నుంచి క్రికెట్‌కి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడే ఒక్కొక్కరు ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు.

ఇటీవల చతేశ్వర్ పుజారా, దీపక్ చాహర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తదితరులు మళ్లీ నెట్స్‌లో చెమటోడ్చగా తాజాగా ఈ జాబితాలో వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా చేరారు.

ఉత్తర‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ప్రాక్టీస్ సెషన్‌కి హాజరైన సురేశ్ రైనా, రిషబ్ పంత్ బ్యాక్ టు బ్యాక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. 2018 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న రైనా కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతుండగా రిషబ్ పంత్ ఈ ఏడాది ఆరంభం నుంచి పేలవ ఫామ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఈ నేపథ్యంలో ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలో సుస్థిర స్థానం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాపడే సూచనలు కనిపిస్తుండగా ఆ విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

దాంతో ఆ టోర్నీ కోసం ఇప్పటి నుంచే క్రికెటర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో రైనా ఆడుతుండగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Advertisement