Advertisement

సాధన షురూ చేసిన రైనా , పంత్ ..

By: Sankar Mon, 13 July 2020 7:50 PM

సాధన షురూ చేసిన రైనా , పంత్ ..



కరోనా వలన దాదాపు మూడు నెలలు ఇంటికె పరిమితం అయినా క్రికెటర్లు ఒక్కొకరుగా మైదానంలోకి దిగుతున్నారు ..ఇప్పటికే ఇంగ్లాండ్ , వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా ముగిసింది ..అయితే ఇండియాలో ఇప్పట్లో మ్యాచ్ లు జరగడం కష్టమే కానీ లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆటగాళ్లు తిరిగి ప్రాక్టీస్ మొదలు పెడుతున్నారు ..ఇప్పటికే పుజారా , రోహిత్ , షమీ ప్రాక్టీస్ మొదలు పెట్టగ తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లు స్టార్ట్ చేసారు ..

ఉత్తర‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ప్రాక్టీస్ సెషన్‌కి హాజరైన సురేశ్ రైనా, రిషబ్ పంత్.. బ్యాక్ టు బ్యాక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. 2018 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా ఉంటున్న రైనా కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతుండగా.. రిషబ్ పంత్ ఈ ఏడాది ఆరంభం నుంచి పేలవ ఫామ్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో.. ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలో సుస్థిర స్థానం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాపడే సూచనలు కనిపిస్తుండగా.. ఆ విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దాంతో.. ఆ టోర్నీ కోసం ఇప్పటి నుంచే క్రికెటర్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో రైనా ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కి పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement