Advertisement

  • మథుర శ్రీకృష్ణ జన్మభూమిపై సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు...

మథుర శ్రీకృష్ణ జన్మభూమిపై సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు...

By: Sankar Mon, 28 Sept 2020 3:21 PM

మథుర శ్రీకృష్ణ జన్మభూమిపై సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు...

అయోధ్య రామ్ జన్మభూమి కేసు ఎన్నో మలుపులు తిరిగి చివరకు 2019లో పరిష్కారం జరిగింది. అయోధ్యలోని వివాదాస్పదంగా ఉన్న భూమిని అయోధ్య ట్రస్ట్ కు అప్పగించింది.

ఈ ఏడాది ఆగష్టు 5 వ తేదీన అయోధ్యలో మందిరం నిర్మాణం కోసం భూమి పూజను నిర్వహించారు. అయోధ్య రామ్ జన్మభూమి వివాదం తరువాత ఇప్పుడు శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన వ్యవహారం తెరమీదకు వచ్చింది. శ్రీకృష్ణుడు జన్మించిన మథురలో శ్రీకృష్ణ దేవాలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ దేవాలయానికి పక్కనే షాహి ఈద్గా ఉన్నది. ఈ ఈద్గా ను అక్కడి నుంచి తొలగించాలని చెప్పి చాలా ఏళ్లుగా వివాదం నడుస్తున్నది.

దీనిపై స్థానికంగా కోర్టులో కేసులు కూడా దాఖలయ్యాయి. అయితే, వివాదం మాత్రం పరిష్కారం కాలేదు. దీనిపై ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. ఈ నెల 30 వ తేదీన మథుర విషయంపై కోర్టు విచారణ చేయబోతున్నది. మరి ఈ కేసు ఎప్పటికి పరిష్కారం అవుతుందో చూడాలి.

Tags :
|

Advertisement