ఏపీలో రాజ్యాంగ సంక్షోభం అంశంపై విచారణలపై సుప్రీం కోర్టుస్టే
By: chandrasekar Fri, 18 Dec 2020 5:51 PM
ఏపీలో రాజ్యాంగ సంక్షోభం
అంశంపై విచారణలపై సుప్రీం కోర్టుస్టే ఇచ్చింది. ఏపీలో పోలీసులు చట్ట ఉల్లంఘనలపై
దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు
తెలుపుతున్న వారిని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెనాలి
శ్రావణ్కుమార్ వేసిన పిల్పై హైకోర్టు విచారణ జరుగుతోంది. అక్టోబరు 1న
హైకోర్టు రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా లేదా అని తేలుస్తామని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్
దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎస్
బోబ్డే ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై యథాతథస్థితి కొనసాగించాలని సూచించింది.
ఈ పిటిషన్లపై ఏపీ
హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా, లేదా అనే అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై
సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలు, విచారణను తప్పుబట్టింది.
హైకోర్టు ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నాయని జడ్జి అలా ఎందుకు అన్నారో అర్ధం కావడం
లేదన్నారు. వ్యవస్థ ఏమీ కుప్పకూలలేదు కదా అన్నారు. హైకోర్టు వ్యాఖ్యలు కలవరపరిచేలా
ఉన్నాయన్నారు. తదుపరి విచారణ శీతాకాల సెలవుల తరువాతకు వాయిదా వేసింది.