కరోనా కారణంగా ఎన్నికలను ఆపమని మేము ఆదేశించలేము ..సుప్రీమ్ కోర్ట్
By: Sankar Fri, 28 Aug 2020 12:14 PM
కరోనా వైరస్ కారణం చేత బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఆపలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఎన్నికలను రద్దు చేసే విధంగా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ సుప్రీం స్పందించింది. కోవిడ్ నెపంతో ఎన్నికలను ఆపలేమని, ఎలక్షన్ కమిషన్ అధికారాలను ప్రశ్నించలేమని సుప్రీం పేర్కొన్నది.
బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇంత వరకు నోటిఫికేషన్ కూడా రాలేదన్నది. సీఈసీకి తామేమీ ఆదేశాలు ఇవ్వలేమని, కమిషనర్ అన్నీ పరిగణలోకి తీసుకుంటారని కోర్టు చెప్పింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాలేదని, అందుకే పిటిషన్కు అర్హత లేదని, ఎన్నికలు నిర్వహించవద్దు అని ఈసీని ఎలా ఆదేశిస్తామని కోర్టు చెప్పింది.
ఎన్నికల వాయిదాకు కోవిడ్ అనేది సరైన కారణం కాదు అని పేర్కొన్నది. నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను రద్దు చేయాలని అవినాశ్ థాకూర్ సుప్రీంలో పిటిషన్ వేశారు.