బిహార్ అసెంబ్లీ ఎన్నికల వాయిదాను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
By: chandrasekar Fri, 28 Aug 2020 9:05 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చేవరకు బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలు చేయబడ్డ పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటివరకూ నోటిఫికేషన్ జారీ చేయనందున ఈ దశలో స్పందించడం తొందరపాటు అవుతుందని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.
దేశంలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అసాధారణ పరిస్ధితుల్లో ఎన్నికలను వాయిదా వేయవచ్చని ప్రజా ప్రాతినిథ్యం చట్టంలో పొందుపరిచిన క్రమంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఆదేశించాలని పిటిషనర్ అవినాష్ ఠాకూర్ కోరారు.
కరోనా సరైన ప్రాతిపదిక కాదని ఎన్నికలు నిర్వహించరాదని తాము ఎన్నికల సంఘాన్ని ఎలా కోరతామని ఎన్నికల వాయిదాకు సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితిని అంచనా వేసి ఎన్నికల సంఘం ఓ నిర్ణయం తీసుకోవాలని, ఎన్నికలు నిర్వహించరాదని కోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించజాలదని పేర్కొంటూ పిటిషన్ను తిరస్కరించింది. ఎన్నికలకు సంబందించిన నిర్ణయం ఎన్నికల కమిషన్ మాత్రమే ముందుగా నిర్ణయించాలని తెలిపారు.