Advertisement

  • జీతాల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

జీతాల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

By: Sankar Thu, 19 Nov 2020 06:42 AM

జీతాల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన మార్చి ఏప్రిల్ నెల జీతాలు పై వడ్డీ చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద సుప్రీంకోర్టు స్టే విధించింది.

వడ్డీ సైతం చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. జీతాలు చెల్లించేందుకు తాము సిద్ధమేనని కానీ వడ్డీలు కూడా చెల్లించాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో కుదిరేపని కాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనతో సంతృప్తి చెందిన సుప్రీం ధర్మాసనం గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ స్టే ఇచ్చింది. కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు తలెత్తాయని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు, వడ్డీ కూడా ఆశించడం సమంజసం కాదని ఇప్పటికే ఇబ్బంది పెడుతున్న రాష్ట్రం మీద ఇంకా భారం వేయడం సరికాదని పేర్కొంది.

Tags :
|

Advertisement