Advertisement

  • వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసే అవకాశాలను పరిశీలించండి ..కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసే అవకాశాలను పరిశీలించండి ..కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

By: Sankar Thu, 17 Dec 2020 6:21 PM

వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేసే అవకాశాలను పరిశీలించండి ..కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు


కేంద్రం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల మీద దేశవ్యాప్తంగా రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే...అయితే ఈ వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలును ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చెప్పింది.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఉద్యమం, నిరసనలపై దాఖలైన పిటిషన్లపై గురువారం అత్యున్నత న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ విచారణ జరుపుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే చెప్పారు. రైతు సంఘాలు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఎటువంటి ఆదేశాలను జారీ చేయలేదు.

మోదీ సర్కార్‌ను ఉద్దేశించి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ, వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును నిలిపేయడానికి అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. ఇందుకు ప్రభుత్వం స్పందిస్తూ, అది జరిగే అవకాశం లేదని పేర్కొంది. దీనిపై జస్టిస్ బాబ్డే స్పందిస్తూ, ముందుగానే కాదనవద్దని, దయచేసి సలహాను పరిశీలించాలని చెప్పారు. ఈలోగా రైతు సంఘాలకు నోటీసులు జారీ చేయాలని అన్నారు.

Tags :

Advertisement