Advertisement

  • సూపర్ స్టార్ రజిని ఆరోగ్యంపై ఆందోళన అవసరంలేదు ...అపోలో వైద్యులు

సూపర్ స్టార్ రజిని ఆరోగ్యంపై ఆందోళన అవసరంలేదు ...అపోలో వైద్యులు

By: Sankar Sat, 26 Dec 2020 3:55 PM

సూపర్ స్టార్ రజిని ఆరోగ్యంపై ఆందోళన అవసరంలేదు ...అపోలో వైద్యులు


సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అనారోగ్యంతో శుక్రవారం హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఆయన సన్నిహితులు అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

రక్తపోటులో హెచ్చతగ్గుల వల్లే రజినీ అనారోగ్యానికి గురయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఆ ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, రక్తపోటు నియంత్రణకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌కు నేడు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మరో రెండ్రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తామని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు.

కాగా రజిని ఆరోగ్యంపై అభిమానులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు అని వైద్యులు తెలిపారు ..అభిమానులు ఎవ్వరు ఆసుపత్రి వద్దకు రావొద్దని వైద్యులు అన్నారు ..కాగా రజినీకి అత్యంత సన్నిహితుడైన నటుడు మోహన్‌బాబు శుక్రవారం అపోలో ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు..పవన్ కళ్యాణ్ , కేటీఆర్ వంటి వారు రజిని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..ఇక రజిని ఆరోగ్యంపై ఆందోళనతో తమిళనాడు నుంచి అభిమానులు హైదరాబాద్ కు వస్తున్నారు...

Tags :
|
|

Advertisement