Advertisement

  • గర్వంగా మరియు ఎమోషనల్ గా ఉంది ..ధోని రిటైర్మెంట్ పై సూపర్ స్టార్ మహేష్ భావోద్వేగ ట్వీట్

గర్వంగా మరియు ఎమోషనల్ గా ఉంది ..ధోని రిటైర్మెంట్ పై సూపర్ స్టార్ మహేష్ భావోద్వేగ ట్వీట్

By: Sankar Sun, 16 Aug 2020 10:26 AM

గర్వంగా మరియు ఎమోషనల్ గా ఉంది ..ధోని రిటైర్మెంట్ పై సూపర్ స్టార్ మహేష్ భావోద్వేగ ట్వీట్


ఇండియన్ లెజెండరీ క్రికెట్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు..ఎంతలా అంటే ధోని రిటైర్ అవ్వాలని కోరుకునేవారు కూడా అయ్యో ధోని ఎందుకిలా చేసావ్ అనేంత చాల సాధారణంగా ఎదో మాములు ఆటగాడిలాగా రిటైర్మెంట్ ప్రకటించాడు ..దీనితో ధోని రిటైర్మెంట్ పై దేశ వ్యాప్తంగా సెలెబ్రిటీలు , అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు..

అయితే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ..‘2011 వన్డే ప్రపంచకప్‌లో సిక్సర్ బాది భారత్‌కు ప్రపంచకప్ అందించిన ఉద్వేగభరితమైన దృశ్యంకి సంబంధించిన పోస్టర్ షేర్ చేస్తూ.. ఆ ఐకానిక్ సిక్సర్‌ను ఎలా మరచిపోగలం. 2011 ప్రపంచకప్ ఛాంపియన్స్ !! వాంఖడే స్టేడియంలో ఉన్నట్టు ఉంది. ఆ సన్నివేశాలు తలచుకుంటే గర్వంగా ఉంది. ఎమోషనల్ అవుతున్నా. క్రికెట్ ఎప్పటికీ ఒకేలా ఉండదు’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

కాగా 2019 ప్రపంచ కప్ సెమి ఫైనల్లో న్యూజిలాండ్ మీద చివరి సారిగా బరిలోకి దిగిన ధోని ఆ తర్వాత మల్లి మైదానంలోబ్యాట్ పెట్టకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు..అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ ఐపీయల్ మాత్రం ధోని బరిలోకి దిగనుండటం అభిమానులకు కొంచెం ఊరట కలిగించే విషయం

Tags :
|
|

Advertisement