బోనాలు కార్యక్రమాల్లో పాల్గొన్న జడ్పీచైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి
By: chandrasekar Sat, 31 Oct 2020 09:25 AM
బోనాలు కార్యక్రమాల్లో జడ్పీచైర్పర్సన్
సునీతా మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. పోచమ్మ తల్లి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ
చల్లగా ఉండాలని వికారాబాద్ జిల్లా
జడ్పీచైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని
మారెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠాపన, బోనాలు
తదితర కార్యక్రమాల్లో గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె
మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ ప్రతి ఒక్కరూ కలిసి
మెలసి ఉండాలని అన్నారు. మారెపల్లి గ్రామంలో గతంలో జిల్లా పరిషత్ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మున్ముందు
మరిన్ని నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ధి చేస్తామ న్నారు.
కావలసిన సౌకర్యాలు
అందించనున్నట్లు తెలిపారు. ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదే విధంగా మండల సర్పంచుల
సంఘం అధ్యక్షుడు, మారెపల్లి సర్పంచ్ బల్వంత్ రెడ్డి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని
అన్నారు. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరించాలని,శానిటైజర్లను
తరుచూ వాడి మహమ్మారి బారిన పడకుండా జాగ్ర
త్తపడాలన్నారు. అంతకు ముందు గ్రామ మహిళలతో కలిసి బోనం ఎత్తుకొని ఊరేగింపులో
పాల్గొన్నారు. నవభారత్ సుద్ద కంపెనీ ఆధ్వర్యంలో గ్రామ మహిళలకు సుమారు 200
మందికి చీరెలను పంపిణీ చేశారు. చాలా వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహించారు.