కోహ్లీ కేవలం యువ క్రికెటర్లకే కాదు వాళ్లందరికీ స్ఫూర్తి.... సునీల్ గవాస్కర్
By: Sankar Thu, 03 Dec 2020 12:55 PM
వన్ డే క్రికెట్ లో అత్యంత వేగంగా పన్నెండువేల పరుగులు చేసిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డు ను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు టీం ఇండియన్ కెప్టెన్ కింగ్ కోహ్లీ...సచిన్ ఈ ఫీట్ చేరుకోవడానికి 300 ఇన్నింగ్స్ తీసుకుంటే కోహ్లీ కేవలం 242 ఇన్నింగ్సలలోనే సాధించాడు...
దీనిపై మ్యాచ్ తర్వాత సునీల్ గావస్కర్ మాట్లాడుతూ..‘ అన్ని ఫార్మాట్లలో కోహ్లి హవా కొనసాగుతోంది. కోహ్లి ప్రదర్శన అద్భుతంగా ఉంది. అండర్-19 ప్లేయర్గా కోహ్లిని చూసిన దగ్గర్నుంచీ అతను రోజురోజుకూ మెరగవుతూనే ఉన్నాడు. అతను గేమ్ను మార్చుకోవడానికి కోహ్లి చాలా శ్రమించాడు. సూపర్ ఫిట్ క్రికెటర్ కావడానికి చాలా త్యాగాలు కూడా చేశాడు..
కోహ్లి కేవలం యువ క్రికెటర్లకే ఆదర్శ కాదు.. ఫిట్నెస్పై దృష్టి సారించే వాళ్లందరికీ అతనొక స్ఫూర్తి. ఒక ఫార్మాట్లో 12వేలకు పైగా పరుగులంటే ఎంతో ప్రతిభ ఉండాలి. అతను ఆడిన 251 వన్డే గేమ్లకు గాను 103 సార్లు యాభైకి పైగా పరుగులు చేశాడంటే అతని ప్రదర్శన నిజంగా అసాధారణం.
వన్డేల్లో 43 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. అత్యంత వేగంగా కోహ్లి సాధించిన ఈ ఫీట్ను మరొకరు సాధిస్తారని నేను అనుకోవడం లేదు. హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చుకోవడానికి కోహ్లిలోని నిలకడే కారణం. కోహ్లి తదుపరి వెయ్యి పరుగులు గురించి మనం వేచిచూద్దాం. మరో 5 నుంచి 6 నెలల్లోనే దాన్ని సాధిస్తాడని ఆశిద్దాం’ అని తెలిపాడు