పితృత్వ సెలవుపై స్పందించిన సునీల్ గవాస్కర్
By: chandrasekar Tue, 01 Dec 2020 12:19 PM
ప్రస్తుతం ఇండియా టీం
ఆస్ట్రేలియా లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ తర్వాత ఇండియాకు తిరిగి రానున్న సంగతి తెలిసిందే. అతని
భార్య అనుష్క శర్మ బిడ్డకు జన్మనివ్వనుండటంతో కోహ్లి పితృత్వ సెలవుపై మధ్యలోనే
వస్తున్నట్లు బీసీసీఐ చెబుతోంది. అయితే బోర్డు విరాట్కు ఇలా అనుమతివ్వడం ఓ ఆసక్తికర
చర్చకు దారి తీసింది. ఇప్పుడైతే ఇలా అడగ్గానే ఇస్తున్నారు గానీ ఒకప్పుడు సునీల్ గవాస్కర్ కూడా పితృత్వ సెలవు
అడిగినా బీసీసీఐ ఇవ్వలేదు అన్న వార్త వైరల్ మారింది.
అప్పుడు కీలకమైన
వెస్టిండీస్ టూర్ కోసం 1975-76 సమయంలో ఇండియన్ టీమ్ సిద్ధమవుతోంది. అదే సమయంలో
బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్న తన భార్య దగ్గరకు వెళ్లడానికి గవాస్కర్
అనుమతి అడిగాడని, అయినా బోర్డు మాత్రం అందుకు అనుమతించలేదని వార్తలు
వచ్చాయి. కానీ దీనిపై గవాస్కర్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తలో కొంత నిజం
ఉంది కానీ తాను పితృత్వ సెలవు అడగటం మాత్రం నిజం కాదని సన్నీ అంటున్నాడు.
నేను న్యూజిలాండ్, వెస్టిండీస్ టూర్ల కోసం బయలుదేరినప్పుడు నా భార్య
ఏ సమయంలో అయినా బిడ్డకు జన్మనివ్వనుందన్న విషయం నాకు తెలుసు.
అయినప్పటికీ నేను టీమ్కు
ఆడటానికే ప్రాధాన్యం ఇచ్చాను అని గవాస్కర్ చెప్పాడు. అయితే న్యూజిలాండ్తో మూడో
టెస్ట్లో అతడు గాయపడ్డాడు. కొన్ని వారాల విశ్రాంతి అవసరం అని డాక్టర్లు
చెప్పారు. వెస్టిండీస్ టూర్కు మధ్యలో మూడు వారాల సమయం ఉండటంతో ఆ లోపు
ఇండియాకు వెళ్లి, తొలి టెస్ట్కు ముందే నేరుగా విండీస్లో టీమ్తో చేరతానని
తాను అడిగినట్లు సన్నీ చెప్పాడు. అయితే అప్పటి టీమ్ మేనేజర్ పాలీ ఉమ్రిగర్
అందుకు ఒప్పుకోలేదని అతనన్నాడు. దీంతో తాను గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా
తొలి టెస్ట్లో ఆడిన విషయాన్ని గవాస్కర్ గుర్తు చేశాడు.