భారత ఫీల్డర్లు వారం ముందుగానే క్రిస్మస్ బహుమతులు పంచిపెట్టారు .... సునీల్ గవాస్కర్
By: Sankar Fri, 18 Dec 2020 6:39 PM
ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీం ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 53 పరుగుల కీలక ఆధిక్యం సాధించింది..అయితే భారత ఫీల్డర్లు ఇంకొంచెం అలెర్ట్ గా ఉన్నట్లైతే టీమిండియా ఇంకా భారీ ఆధిక్యాన్ని సాధించి ఉండేది...అయితే టీమిండియా చెత్త ఫీల్డిండ్పై మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ తన దైన శైలిలో స్పందించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు పలు క్యాచ్లు జారవిడిచారు. దీనిపై సునీల్ గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. టీమిండియా ఆటగాళ్ల వరస్ట్ ఫీల్డింగ్తో ఆస్ట్రేలియాకు వారం ముందుగానే క్రిస్మస్ పండుగ వచ్చిందని ఎద్దేవా చేశాడు.
ఆసీస్ ఇన్నింగ్స్ 23వ ఓవర్లో మార్నస్ లబుషేన్ ఇచ్చిన సులువైన క్యాచ్ను పృథ్వీ షా నేలపాల్జేశాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ.. క్రిస్మస్ మూడ్లో ఉన్న భారతీయులు వారం ముందుగానే బహుమతులు పంచిపెట్టారని వ్యాఖ్యానించాడు.