Advertisement

పెట్రో ధరలలో ఆదివారం కాస్త ఉప శమనం

By: chandrasekar Mon, 29 June 2020 6:54 PM

పెట్రో ధరలలో ఆదివారం కాస్త ఉప శమనం


మూడు వారాలుగా ప్రతిరోజూ పెట్రోలు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు వాహనదారులకు పెట్రో ధరల మంట నుంచి కాస్త ఊరట లభించింది. అయినా పెట్రోల్ కన్నా డీజిల్ ధర అధికంగా ఉండటం గమనార్హం.

కొన్ని రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. వరుసగా 21 రోజులుగా పెరిగిన పెట్రో ధరలలో ఆదివారం కాస్త ఉప శమనం లభించింది. గత మూడు వారాలుగా ప్రతిరోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ఆదివారం స్థిరంగా కొనసాగుతన్నాయి.

ఆయిల్ కంపెనీలు, ముడి చమురు సంస్థలు వాహనదారులకు ఆదివారం స్వల్ప ఊరట కలిగించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరల(Petrol Price Today In Delhi) మోతకు ఈ ఒక్కరోజు బ్రేక్ పడింది.

జూన్ 27న ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 21 పైసలు పెరగడంతో వరుసగా ధరలు రూ. 80.38, లీటరు డీజిల్ రూ. 80.40గా ఉన్నాయి. ఆదివారం అదే ధరల వద్ద పెట్రోలు, డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి.

Tags :
|
|
|

Advertisement