Advertisement

  • అర్థ సెంచరీతో రాణించిన మనీష్ పాండే ..రాజస్థాన్ లక్ష్యం 159 పరుగులు

అర్థ సెంచరీతో రాణించిన మనీష్ పాండే ..రాజస్థాన్ లక్ష్యం 159 పరుగులు

By: Sankar Sun, 11 Oct 2020 5:38 PM

అర్థ సెంచరీతో రాణించిన మనీష్ పాండే ..రాజస్థాన్ లక్ష్యం 159 పరుగులు


ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తక్కువ స్కోరు‌కి పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్.. మనీశ్ పాండే (54: 44 బంతుల్లో 2x4, 3x6), డేవిడ్ వార్నర్ (48: 38 బంతుల్లో 3x4, 2x6) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడటంతో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో జోప్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, జయదేవ్ ఉనద్కత్ తలో వికెట్ తీశారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఆరంభంలోనే ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (16: 19 బంతుల్లో 1x6) ఔటవగా.. అనంతరం వచ్చిన మనీశ్ పాండే‌తో కలిసి డేవిడ్ వార్నర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

పిచ్ బ్యాటింగ్‌కి కష్టమైన పిచ్‌పై జాగ్రత్తగా ఆడిన ఈ జోడీ రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కానీ.. టీమ్ స్కోరు 96 వద్ద వార్నర్ ఔటవగా.. తర్వాత కొద్దిసేపటికే హాఫ్ సెంచరీ నమోదు చేసిన మనీశ్ పాండే కూడా పెవిలియన్ కూడా చేరిపోయాడు.చివర్లో కేన్ విలియమ్సన్ (22 నాటౌట్: 12 బంతుల్లో 2x6), ప్రియమ్ గార్గ్ (15: 8 బంతుల్లో 1x4, 1x6) బ్యాట్ ఝళిపించడంతో హైదరాబాద్ 158 పరుగులు చేయగలిగింది.

Tags :
|
|

Advertisement