- హోమ్›
- వార్తలు›
- గెలిస్తే ప్లే ఆఫ్ కు ...కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ను ఢీకొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్
గెలిస్తే ప్లే ఆఫ్ కు ...కీలక పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ను ఢీకొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్
By: Sankar Tue, 03 Nov 2020 4:32 PM
ఐపీఎల్-13 సీజన్లో లీగ్ దశలో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఢీకొట్టేందుకు డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది.
ఈ మ్యాచ్ గెలిస్తేనే సన్రైజర్స్ ప్లేఆఫ్ చేరుతుంది. ముంబైపై సన్రైజర్స్ గెలిస్తే కోల్కతా టోర్నీ నుంచి నిష్రమిస్తుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు గెలిచి మంచి నెట్ రన్రేట్తో ఉన్న సన్రైజర్స్.. ఇప్పటికే నాకౌట్కు అర్హత సాధించిన ముంబైను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది.
ఒకవేళ ఓడితే కోల్కతా నైట్రైడర్స్కు మార్గం సుగమమవుతుంది. లీగ్ దశను గెలుపుతో ముగించాలని ముంబై భావిస్తోంది. గత రెండు మ్యాచ్ల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయాలు సాధించిన హైదరాబాద్ జోరుమీద ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ బెయిర్స్టో స్థానంలో ఓపెనర్గా జట్టులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా గొప్పగా రాణిస్తున్నాడు. బెయిర్స్టో స్థానంలో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ బంతితో అదరగొడుతున్నాడు. మరోవైపు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్తో పాటు పేసర్లు సందీప్ శర్మ, నటరాజన్ రాణిస్తుండడం హైదరాబాద్కు సానుకూలాంశం.