- హోమ్›
- వార్తలు›
- డ్రగ్స్ కేసులో దీపిక పదుకొణె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్లకు సమన్లు
డ్రగ్స్ కేసులో దీపిక పదుకొణె, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్లకు సమన్లు
By: chandrasekar Thu, 24 Sept 2020 10:32 AM
సుశాంత్ సింగ్ మరణం
తరువాత బాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు చాలా వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా దీపిక
పదుకొణె, సారా
అలీ ఖాన్, శ్రద్ధా
కపూర్, రకుల్
ప్రీత్ సింగ్లకు సమన్లు జారీ చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో
ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) దూకుడు పెంచింది. రియా చక్రవర్తితో పాటు
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ జయా సాహాను విచారించిన ఎన్సీబీ వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో దీపిక
పదుకొణె, సారా
అలీ ఖాన్, శ్రద్ధా
కపూర్, రకుల్
ప్రీత్ సింగ్లకు సమన్లు జారీ చేసింది.
విచారణకోసం ఈ కేసుకు
సంబంధించి మూడు రోజుల్లో తమ ముందుకు హాజరుకావాలని ఎన్సీబీ ఆదేశించింది. సుశాంత్ రాజ్పుత్
మృతి కేసు దర్యాప్తులో భాగంగా డ్రగ్స్ కేసును ఎన్సీబీ లోతుగా విచారిస్తోంది. ఈ కేసులో నిన్న దీపిక పదుకొణె కరిష్మా ప్రకాశ్ను
ప్రశ్నించిన ఎన్సీబీ రియా ఫోన్ చాటింగ్ ఆధారంగా వీరికి సమన్లు జారీ చేసినట్టు
తెలుస్తోంది. దీపికతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్లకు సైతం ఎన్సీబీ సమన్లు జారీ
చేసినట్టు తెలుస్తోంది. విచారణ వివరాలు తెలియాల్సి వుంది.