Advertisement

రైలు బోగీలో నుంచి అకస్మాత్తుగా పెద్ద మంటలు...

By: chandrasekar Tue, 03 Nov 2020 6:59 PM

రైలు బోగీలో నుంచి అకస్మాత్తుగా పెద్ద మంటలు...


మేడ్చల్‌ రైల్వేస్టేషన్‌లో నిలిచి ఉన్న ఓ రైలులో ఉన్నట్టుండి రైలు చివరిబోగీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రైలులో అకస్మాత్తుగా మంటలు రావడంతో అక్కడే ఉన్న సిబ్బంది, స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.

నీటి పైపుల ద్వారా నీళ్లను చల్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఓ బోగీలో చెలరేగిన మంటలు ఇంకో బోగికి కూడా అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమై ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు.

ప్రమాదానికి గురైన బోగీలో అదృష్టవశాత్తూ ప్రయాణికులెవరూ లేరు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు ఆరిపోయినా రైలు బోగి కిటికీల్లోంచి దట్టమైన పొగలు బయటకు వచ్చాయి.

అగ్ని ప్రమాదం గురించి విషయం తెలుసుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. బోగీలో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :
|

Advertisement