Advertisement

  • సుబ్రహ్మణ్య స్వామి తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మరో ట్వీట్

సుబ్రహ్మణ్య స్వామి తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మరో ట్వీట్

By: chandrasekar Wed, 26 Aug 2020 09:09 AM

సుబ్రహ్మణ్య స్వామి తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మరో ట్వీట్


ప్రముఖ బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణంలో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అనేక అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య కాదని అతనిని మ‌ర్డ‌ర్ చేయబడ్డాడు అని వ్యాఖ్యానించిన ఆయ‌న నిన్న‌టి ట్వీట్‌లో సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్ ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే సుబ్రమణ్య స్వామి సునంద పుష్కర్ కేసుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన ఇంతకు మునుపే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.

సుశాంత్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవ్వడంతో దేశమంతా కలకలం రేపుతోంది. అదే విధంగా సునంద హత్యానంతరం పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆమె కడుపులో వెలికి చూసిన వాటితోనే నిజం ఏంటనేది తెలిసింది. కానీ ప్రముఖ నటి శ్రీదేవి మరియు సుశాంత్ కేసులలో ఇది జరగలేదు. అంతేకాక సుశాంత్ హత్య జరిగిన రోజు దుబాయ్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ 'సుశాంత్' ని ఎందుకు కలిశాడు అని స్వామి తన ట్వీట్ లో ప్రశ్నించారు. ఇక తాజాగా మ‌రో ట్వీట్‌లో చంపిన వారి క్రూర మ‌న‌స్త‌త్వం నెమ్మ‌దిగా వెల్ల‌డి అవుతుంది. శవ ప‌రీక్ష ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆల‌స్యం చేయ‌బ‌డుతుంది. అందుకు కార‌ణం సుశాంత్ క‌డుపులో ఉన్న విషాలు జీర్ణ ద్ర‌వాల వ‌ల‌న గుర్తింప‌బ‌డ‌కుండా పోతాయి అంటూ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. సుబ్రమణ్య స్వామి ఆరోపణలు ఇప్పుడు బాలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. ప్రస్తుతం సుశాంత్ కేసుని సీబీఐ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement