స్టన్ గన్తో సుశాంత్ సింగ్ను హత్య చేశారన్న సుబ్రహ్మణ్య స్వామి
By: chandrasekar Thu, 13 Aug 2020 04:23 AM
స్టన్ గన్తో సుశాంత్
సింగ్ను హత్య చేశారని సంచలన వ్యాఖ్యలు
చేసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి.
ప్రముక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసు దర్యాప్తు కొనసాగుతున్న విషయం
అందరికి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్
అనుమానాస్పద మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ను స్టన్ గన్తో హత్య
చేశారన్నారు స్వామి తెలిపారు. అందుకే ఈ కేసును సీబీఐతోపాటు ఎన్ఐఏతో కూడా దర్యాప్తు
చేయాలని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.
మనుషులను కొంతసేపు
పారాలైజ్ చేసేందుకు సాధారణంగా స్టన్ గన్లను ఉపయోగిస్తారని అయితే సుశాంత్ను కూడా
అదే గన్తో పారాలైజ్ చేసి తరువాత అతనికి ఉరి వేసి చంపి ఉంటారని ఆయన అన్నారు.
సుశాంత్ సింగ్ ఎడమ మెడ వైపు ఉన్న ముద్రలు స్టన్ గన్తో పడినవే అని అయన
తెలియజేసారు. అయితే సుబ్రహ్మణ్య స్వామి పెట్టిన పోస్టుతో పాటు ఆయన వ్యాఖ్యల్ని
పలువురు డాక్టర్లు కూడా సమర్థిస్తున్నారు. స్టన్ గన్తో సరిగ్గా శరీరంపై అలాంటి
ముద్రలే పడతాయంటున్నారు. అందుకే సుశాంత్ ను స్టన్ గన్తో చంపి ఉండవచ్చని అనుమానాలు
వ్యక్తంచేస్తున్నారు.
ఆ స్టన్ గన్ గన్ ఎక్కడి
నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు తెచ్చారు అనే వివరాలపై ఎన్ఐఏతో దర్యాప్తు
చేయించాలని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కాగా ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె
సోదరుడికి చెందిన ఫోన్లు, ట్యాబ్లు, ఇతర డివైస్లను ఈడీ సీజ్ చేసింది. అదేవిధంగా సుశాంత్ అకౌంట్లలో ఉన్న రూ.15
కోట్లు ఏమైపోయాయి అనే నేపథ్యంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో
భాగంగా ఇప్పటికే పలుసార్లు రియా, ఆమె సోదరుడు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బాలీవుడ్
లో జరిగిన ఈ హత్య అనేక అనుమానాలను కలిగిస్తున్నాయి.
అసలు సుశాంత్ సింగ్ మరణం
హత్య లేదంటే ఆత్మ హత్య అనేది తెలవలసి వుంది. ఇది ఇలా ఉంటే సుశాంత్ సింగ్ మృతిపై
ఆయన తండ్రి గారు రియాపై బీహార్లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. పాట్నా
పోలీసులు దర్యాప్తు చేస్తున్న సుశాంత్ కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా
చక్రవర్తి సుప్రీంను ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టులో గురువారం వరకు విచారణను
వాయిదా వేసింది. అన్ని వర్గాల వారినుండి వాదనలను విన్న కోర్టు తీర్పును
గురువారానికి రిజర్వ్ చేసింది. అతని మరణంలో అనేక సందేహాలు ఉండడంతో రోజుకో విషయం
వెలుగు చూస్తుంది. త్వరగా విచారణ పూర్తయి నిందితులను శిక్షించాలని అతని అభిమానులు
కోరుతున్నారు.