Advertisement

  • సుశాంత్ మీద విష ప్రయోగం జరిగింది .. బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

సుశాంత్ మీద విష ప్రయోగం జరిగింది .. బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

By: Sankar Tue, 25 Aug 2020 4:59 PM

సుశాంత్ మీద విష ప్రయోగం జరిగింది .. బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణం మీద రోజు ఎదో ఒక వార్త వస్తూనే ఉంది..ఆత్మహత్య కాదు అని కొందరు అంటుంటే , మరికొందరు మాత్రం అది ఆత్మహత్య అనే అంటున్నారు..అయితే విష ప్రయోగం వల్లే మరణించాడంటూ బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.

సుశాంత్‌ కడుపులో ఉన్న విషం ఆనవాలు లేకుండా పోయేంత వరకు వేచిచూసి.. ఆ తర్వాతే శవ పరీక్ష నిర్వహించారన్నారు. నటుడి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని.. హంతకుల రాక్షస మనస్తత్వం, వారి చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు.

ఇక సుశాంత్‌ సన్నిహితుడిగా పేరొందిన సందీప్‌ సింగ్‌ తీరుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడు పదే పదే దుబాయ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఈ విషయాలపై కూడా విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుశాంత్‌ మృతికి కారకులైన వారి వివరాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు.

ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేశారు. కాగా జూన్‌ 14న సుశాంత్‌ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆది నుంచి ఈ నటుడిది హత్యేనని పేర్కొంటూ సుబ్రహ్మణ్యస్వామి పలు సందేహాలను లేవనెత్తుతున్నారు.ఈ క్రమంలో సుశాంత్‌ హత్య జరిగిన రోజున దుబాయ్‌ కంప్లైంట్‌ డ్రగ్‌ డీలర్‌ అయాష్‌ ఖాన్‌ సుశాంత్‌ సింగ్‌ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు

Tags :

Advertisement