మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లుకు గట్టి షాక్
By: chandrasekar Fri, 18 Sept 2020 10:02 AM
వ్యవసాయ రంగానికి
సంబంధించి మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త
బిల్లును నిరసిస్తూ కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా
చేశారు. బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో
మంత్రి పదవి పొందారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ నిర్ణయం మేరకు ఆమె ఈ సంచలన నిర్ణయం
తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం
తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాలని
శిరోమణి అకాలీదళ్ నిర్ణయించింది. పార్టీ నిర్ణయం మేరకు హర్సిమ్రత్ కౌర్ రాజీనామా
చేశారు. రెండు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అకాలీదళ్ ఇప్పటికే
స్పష్టం చేసింది. మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను
వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న శిరోమణి అకాలీదళ్.. ఎన్డీయే ప్రభుత్వానికి వెలుపల
నుంచి మద్దతిస్తామని తెలపడం గమనార్హం.