బావిలో వింత జంతువు... హడలి పోతున్న ప్రజలు...!
By: Anji Wed, 16 Dec 2020 1:30 PM
తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు, కపిలేశ్వరపురంలో వింత జంతువు కలకలం రేపింది. వింత జంతువు సంచరిస్తున్నట్టు స్థానిక రైతులు గుర్తించారు.
అది పశువులను చంపేస్తోందని ప్రచారం మొదలైంది. ఆలమూరు మండలం జొన్నాడ –పెనికేరుకు మధ్యలో ఓ జామ తోటలో ఉన్న పాడుపడ్డ నూతిలో ఓ బావిలో ఉన్నట్లు రైతులు గుర్తించారు.
బావిలో నుంచి పైకి చూస్తూ.. జనాల్ని చూసి లోపలికి వెళ్లిపోతోందని రైతులు తేల్చారు. వింత జంతువు దగ్గరకు వెళ్లేందుకు రైతులు భయపడ్డారు.
రైతులు వెంటనే ఆ వింత జంతువు విషయాన్ని అటవీశాఖ అధికారులు సమాచారాన్ని అందించారు. వారు ఆ బావి దగ్గరకు చేరుకుని ఆ జంతువును పరిశీలించారు. అయితే అది వింత జంతువు కాదని తేల్చారు.
పెనికేరు బావిలో ఉన్నది నీటి కుక్క అని అధికారులు తేల్చారు. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ నీటి కుక్కను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.