డెరిక్ ఓబ్రెయిన్తో పాటు 8 మంది సభ్యులపై రాజ్యసభ సస్పెన్షన్
By: chandrasekar Mon, 21 Sept 2020 5:03 PM
రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆందోళన
చేపట్టిన విపక్ష సభ్యులపై చైర్మన్ వెంకయ్యనాయుడు చర్య తీసుకున్నారు. డెరిక్ ఓబ్రెయిన్తో పాటు 8 మంది
సభ్యులపై రాజ్యసభ సస్పెన్షన్ విధించింది. ఆదివారం రాజ్యసభలో జరిగిన ఘటనను
ఆయన గుర్తు చేస్తూ విపక్ష ఎంపీలు సోషల్ డిస్టాన్స్, కరోనా
నిబంధనలు మరచి పోయారన్నారు. కొందరు సభ్యులు
వెల్లోకి దూసుకువచ్చారని, డిప్యూటీ చైర్మన్పై పేపర్లు, రూల్
బుక్ను విసిసిరనట్లు చైర్మన్ వెంకయ్య పేర్కొన్నారు. బెంచ్లపై డ్యాన్సులు
చేయడం, పేపర్లు
విసిరేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఇదే పార్లమెంటరీ మర్యాదనా అని ఆయన ఆగ్రహం
వ్యక్తం చేసారు. ఓ దశలో డెరిక్ ఓబ్రెయిన్పై వెంకయ్య ఫైర్ అయ్యారు. సభ నుంచి బయటకు
వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఆదివారం రోజున
మార్షల్స్ రాకుంటే డిప్యూటీ చైర్మన్పై సభ్యులు దాడి చేసి ఉండేవారన్నారు.
మనమే సాధారణ ప్రజలకు
నిబంధనల గురించి వివరి౦చవలసిన మనమే ఆ నిబంధనలను పాటించకుంటే ఎలా అన్నారు.
డిప్యూటీ చైర్మన్ను భౌతికంగా బెదిరించారన్నారు.
అయితే డిప్యూటీ చైర్మన్పై
విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానం చెల్లదని వెంకయ్య ప్రకటించారు. 90 సీ
నిబంధన ప్రకారం డిప్యూటీ చైర్మన్పై నోటీసు ఇవ్వడానికి 14 రోజుల
గడువు ఇవ్వాలని, ప్రతిపక్షనేతతో పాటు ఇతర సభ్యులు ఇచ్చిన
నోటీసులు చెల్లదు అని చైర్మన్ వెంకయ్య చెప్పారు. దీంతో విపక్ష సభ్యులు ఇచ్చిన
అవిశ్వాస తీర్మానం నోటీసులు సరైన రీతిలో లేదని తెలియచేసారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మురళీధరన్
8 మంది
సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెషన్ మొత్తం వారిపై వేటు వేస్తున్నట్లు
తెలిపారు. డిప్యూటీ చైర్మన్పై రూల్ బుక్ విసిరిన డెరిక్ ఓబ్రెయిన్, సంజయ్
సింగ్, రాజీవ్
సతావ్, కేకే
రాజేశ్, సయ్యిద్
నజీర్ హుస్సేన్, రిపున్ బోరా, డోలా సేన్, ఇలమారం కరీమ్లు ఆ జాబితాలో ఉన్నారు.