Advertisement

  • అంతుచిక్క‌ని వ్యాధి కాద‌ని క‌జ‌కిస్థాన్ ఆరోగ్య శాఖ ప్రకటన

అంతుచిక్క‌ని వ్యాధి కాద‌ని క‌జ‌కిస్థాన్ ఆరోగ్య శాఖ ప్రకటన

By: chandrasekar Sat, 11 July 2020 10:47 AM

అంతుచిక్క‌ని వ్యాధి కాద‌ని క‌జ‌కిస్థాన్ ఆరోగ్య శాఖ ప్రకటన


ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్‌తో పోరాటం చేస్తున్నవేళ క‌జ‌కిస్థాన్‌లో కొత్త ర‌కం వ్యాధి ప్ర‌బ‌లిందని చైనా ప్ర‌క‌టించింది. క‌జికిస్థాన్‌ను అంతుచిక్క‌ని వ్యాధి విస్త‌రిస్తున్న‌దంటూ చైనా చేసిన ప్ర‌క‌ట‌న‌ను క‌జ‌కిస్థాన్ ప్ర‌భుత్వం కొట్టిపారేసింది. చైనా ప్ర‌క‌ట‌న‌లో నిజం లేద‌ని తేల్చిచెప్పింది.

ఈ అంతుచిక్క‌ని న్యూమోనియా వ్యాధి బారినప‌డి గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో 1772 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అది క‌రోనా మ‌హ‌మ్మారికంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని పేర్కొన్న‌ది. అందువ‌ల్ల ఆ దేశంలోని చైనీయులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌జకిస్థాన్‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యం హెచ్చ‌రించింది. ఈ నేప‌థ్యంలో చైనా ఎంబ‌సీ ప్ర‌క‌ట‌నను ఖండిస్తూ క‌జికిస్థాన్ ప్ర‌భుత్వం తాజా ప్ర‌క‌ట‌న చేసింది.

ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌బ‌లుతున్న వ్యాధికి వైరల్ న్యూమోనియా ఇన్‌ఫెక్షన్, బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలతో పోలికలు ఉన్నాయని తెలిపింది. ఈ వ్యాధి కార‌ణంగా అధిక‌ మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న‌మాట వాస్త‌వమే అయినా, ఇది అంతుచిక్క‌ని వ్యాధి మాత్రం కాద‌ని క‌జ‌కిస్థాన్ ఆరోగ్య శాఖ పేర్కొన్న‌ది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై రిపోర్టు ఇచ్చింద‌ని క‌జ‌కిస్థాన్ తెలిపింది.

Tags :
|

Advertisement