నేడే రెడ్ మీ 9ఏ సేల్ ప్రారంభం
By: chandrasekar Tue, 22 Sept 2020 5:44 PM
షియోమీ రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్ను మనదేశంలో ఈమధ్యే లాంచ్ చేసింది.
దీని సేల్ మనదేశంలో ఈరోజు (సెప్టెంబర్ 22వ తేదీ) జరగనుంది. అమెజాన్, ఎంఐ.కాంల్లో
మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీడియాటెక్
హీలియో జీ25 ప్రాసెసర్,
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం వంటి లేటెస్ట్ ఫీచర్లను అందించడం
విశేషం.
రెడ్ మీ 9ఏ ధర
మరియు స్పెసిఫికేషన్లు
ఇందులో రెండు వేరియంట్లు
అందుబాటులో ఉన్నాయి. వీటిలో 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,799గా
నిర్ణయించారు.
3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా
ఉంది. మిడ్ నైట్ బ్లాక్, నేచర్ గ్రీన్, సీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 6.53
అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను షియోమీ అందించిం. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా
ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ పై రెడ్ మీ 9ఐ
పనిచేయనుంది.
3 జీబీ వరకు ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ను ఇందులో
అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ
వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఇందులో వెనకవైపు 32 మెగా
పిక్సెల్ కెమెరా, ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్
లో ఈ సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ ఫోన్ అంచులు కొంచెం
లావుగానే ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ
ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 10
ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్ మీ 9ఏ
పనిచేయనుంది. ఇందులో ఉండే ఎన్ హేన్స్ డ్ లైఫ్ స్పాన్ బ్యాటరీ టెక్నాలజీ ద్వారా ఈ
ఫోన్ బ్యాటరీ మూడు సంవత్సరాల పాటు మన్నుతుందని షియోమీ తెలిపింది.
4జీ ఎల్టీఈ, వైఫై బ్లూటూత్, జీపీఎస్,
3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్ బీ పోర్లు వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
ఏఐ ఫేస్ అన్ లాక్ ఫీచర్ కూడా
దీనిలో ఉంది. ఈ ఫోన్ మందం 0.9 సెంటీమీటర్లు కాగా, బరువు 194
గ్రాములు.