అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
By: chandrasekar Thu, 05 Nov 2020 1:08 PM
అంతర్జాతీయ క్రికెట్కు
వెస్టిండీస్ బ్యాట్స్మన్ మార్లోన్ శామ్యూల్స్(39) రిటైర్మెంట్
ప్రకటించాడు. రెండు టీ20 ప్రపంచకప్ల విజయాల్లో మార్లోన్ కీలక పాత్ర
పోషించాడు. రెండుసార్లు ఫైనల్ పోరులో అత్యధిక స్కోరు సాధించాడు. ఈ ఏడాది జూన్లో తన వీడ్కోలు గురించి
వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సమాచారం ఇచ్చాడు. 2018 డిసెంబర్లో బంగ్లాదేశ్తో
చివరి మ్యాచ్ ఆడాడు. 2012,
2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ రెండింటిలోనూ అత్యధిక స్కోరు
సాధించి కరీబియన్కు ట్రోఫీలు అందించాడు. కొలంబో వేదికగా జరిగిన 2012
వరల్డ్ టీ20 ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ఒక్కసారిగా
వెలుగులోకి వచ్చాడు. ఆ మ్యాచ్లో 56 బంతుల్లో 78 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లోనూ అద్భుత గణాంకాలు(1/15) నమోదు చేయడంతో విండీస్ సునాయాస విజయాన్ని అందుకుంది.
కోల్కతాలో జరిగిన 2016
వరల్డ్ టీ20 ఫైనల్లోనూ అతడు సత్తాచాటాడు. ఇంగ్లాండ్తో
తుదిపోరులో 66 బంతుల్లో 85 రన్స్ రాబట్టడంతో ఇంగ్లీష్ జట్టుపై 4
వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండు ఐసీసీ
ఫైనల్ మ్యాచ్ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన ఏకైక ఆటగాడు శామ్యూల్సే
కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో
కరీబియన్ జట్టు తరఫున శామ్యూల్స్ 71 టెస్టులు,
207 వన్డేలు,
67 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,134 పరుగులు చేయగా.. 17 శతకాలు పూర్తి చేసుకున్నాడు. 152
వికెట్లు కూడా తీసాడు.