Advertisement

  • ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం...భోరున విలపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్రెడ్డిని ప్రశ్నించిన మహిళ

ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం...భోరున విలపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్రెడ్డిని ప్రశ్నించిన మహిళ

By: chandrasekar Wed, 19 Aug 2020 3:58 PM

ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం...భోరున విలపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్రెడ్డిని ప్రశ్నించిన  మహిళ


రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, ఇవన్నీ మీకు తెలుసా అంటూ భోరున విలపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోన్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తగినంత సిబ్బంది ఉన్నారని ప్రభుత్వం చెబుతోందని. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దారుణంగా ఉన్నాయని వాపోయారు.

ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రికి గుండెపోటు రావడంతో వినుకొండ నుంచి తొలుత గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లిన్నట్లు చెప్పారు. అయితే అక్కడ భారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పడంతో అంత స్తోమత లేక ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం బాగుటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుండటంతో నమ్మి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చామని తెలిపారు. అయితే ఇక్కడికి వస్తే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఎమర్జెన్సీ కేసు అని ఎంత బ్రతిమిలాడినా వారు డాక్టర్‌ను పిలవలేదన్నారు. దీంతో విలవిలలాడుతూ తన తండ్రి మరణించారని ఆమె రోదిస్తూ చెప్పింది. వైద్య సిబ్బందే తన తండ్రిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ ఎందుకు పట్టించుకోవడంలేదని ఆమె ప్రశ్నించారు.

తన తండ్రి రెండు గంటలు విలవిల్లాడిపోయారని, అయినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. తన కళ్ల ముందే తండ్రి ప్రాణాలు పోయాయని ఆమె కన్నీటిపర్యంతమైంది. చివరకు తన తండ్రి శవాన్ని ఇచ్చే ముందు కరోనా పరీక్ష నిర్వహించాలని చెప్పారని, కానీ రూ. 1,200 ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆమె తెలిపారు. కరోనా పరీక్ష ఉచితంగా చేస్తారు కదా అని నిలదీస్తే చివరకు కరోనా నెగిటివ్ రావడంతో మృత దేహాన్ని ఇచ్చారని వివరించారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు చూస్తే అంతా తెలుస్తుందని ఆమె చెప్పారు.

Tags :

Advertisement