శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్ ప్రమాదంలో తొమ్మిది నిండు ప్రాణాలను బలి
By: chandrasekar Sat, 22 Aug 2020 7:12 PM
శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్ ప్రమాదంలో తొమ్మిది నిండు ప్రాణాలను బలయ్యాయి. ఇందులో మృతుల్లో ఐదుగురు ఇంజనీర్లు, ఇద్దరు ప్లాంట్ అటెండెంట్లు , ఇద్దరు ప్రైవేటు ఎంప్లాయీస్ వున్నారు. యూనిట్ లో గురువారం రాత్రి చెలరేగిన మంటలు కారణంగా శుక్రవారం సాయంత్రం దాకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. మంటలను ఆర్పుతూ ఊపిరా డక విలవిలలాడిని సిబ్బంది టన్నెల్ నుంచి ఎగ్జిట్ దాకా వచ్చి ప్రాణాలు విడిచారు. సొరంగమంతా కమ్ముకున్న పొగ రెస్క్యూ కు ఆటంకం కలిగించింది. వెలుగులు నింపే బతుకులు చీకట్లో కలిసిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లా పాతాళగంగ వద్ద శ్రీశైలం హైడల్ పవర్ ప్లాంట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం తొమ్మిది నిండు ప్రాణాలను బలితీసుకుంది. ప్లాంట్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు ప్రయత్నిం చిన ఇంజనీర్లు, ఉద్యోగులు ఊపిరాడక, బయటకు వచ్చే పరిస్థితి లేక అందులోనే తుదిశ్వాస విడిచారు.
తుదిశ్వాస విడిచిన వారిలో ఓక డీఈ, నలుగురు ఏఈలు, ఇద్దరు ప్లాంట్ అటెండెంట్లు , ఇద్దరు అమరాన్ బ్యాటరీ స్టాఫ్ ఉన్నారు. మృతులంతా 30 నుంచి 35
ఏండ్ల లోపువాళ్లే.
900 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ఈ ప్లాంట్ ఏర్పడినప్పటి నుంచి ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని విద్యుత్ శాఖ చెబుతోంది. అయితే పవర్ ప్లాంట్లో సరైన ఫైర్ సెఫ్టీ లేకపోవడం, పది గంటలు ఆలస్యంగా రెస్క్యూ టీమ్ కు సమాచారం ఇవ్వడంతోనే ప్రాణ నష్టం జరిగినట్లు ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద టైం లో 24
మంది అక్కడ ఉండగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి పొగతో ఊపిరాడక, బయటకు వచ్చే పరిస్థితి లేక తుదిశ్వాస విడిచారు. 15 మంది బయటకు రాగా వారిలో ఆరుగురికి గాయాలయ్యాయి.
ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని విద్యుత్ శాఖ ప్రకటించింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళగంగ వద్ద భూగర్భ జల విద్యుత్ కేంద్రం ఉంది. దీనికెపా సిటీ
900 మెగావాట్లు. గురువారం రాత్రి 10.30 గంటలకు ఈ పవర్ ప్లాంట్ ఫస్ట్ యూనిట్ లోని ప్యానల్లో మంటలు చె లరేగాయి . వాటిని అదుపు చేసేందుకు అక్కడి సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఎంతకూ మంటలు తగ్గకపోగా ఇతర వస్తువులకు కూడా అంటుకొని భారీ పేలుళ్లు సంభవిం చాయి. దీం తో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. తొమ్మిది మంది అందులోనే చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాతగానీ విషయం బయటకు తెలియలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అర్ధరాత్రి
12.30 నుంచి ఒంటిగంట మధ్య ఫైర్ సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది.
ఈ సమయంలో ఫైర్ టీమ్స్ టెర్మినల్ లోని ప్యానల్ వరకు వెళ్లగలిగినా దట్టమైన పొగల కారణంగా ఏమీ కనిపించక వెనుదిరిగారు. తర్వాత వచ్చిన ఎన్ డీఆర్ఎఫ్ టీమ్ కూ ఇదే పరిస్థితి ఎదురైంది. శుక్రవారం మధ్యాహ్నం సీఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. సాయంత్రం 6 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అయినప్పటికీ లోపల చిక్కుకున్న వారిలో ఏ ఒక్కరూ బతకలేదు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ట్రాన్స్కో, జెన్ కో సీఎండీ ప్రభా కర్ రావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్, ఎస్పీ డాక్టర్సాయి శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మృతుల్లో ఐదుగురు ఇంజనీర్లు, ఇద్దరు ప్లాంట్ అటెండెంట్లు, ఇద్దరు అమరాన్ బ్యాటరీ కంపెనీకి చెందిన సిబ్బంది ఉన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు అండర్ గ్రౌండ్ జల విద్యుత్ కేంద్రంలోని ఫస్ట్ యూనిట్ ప్యానల్ నుంచి ఒక్కసారిగా స్పార్క్ వచ్చింది. వెంటనే అక్కడి ఇంజనీర్లు , ఇతర ఎంప్లాయీస్ అలర్ట్ అయ్యారు. మంటలను ఆర్పేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. కానీ.. మంటలు ఏ మాత్రం అదుపులోకి రాలేదు. అంతకంతకూ ఎగిసి పడ్డాయి. విషయం సీనియర్ ఆఫీసర్లకు తెలియగానే వాళ్లు వచ్చే సరికే సొరంగం అంతా పొగలు నిండుకున్నాయి. లోపల డ్యూటీలో ఉన్న సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సుమారు కిలోమీటర్ సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ ప్రమాదంలో తొమ్మిది మంది లోపలే చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు ప్రారంభించారు. సొరంగం నిండా దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. మధ్యాహ్నం సీఐఎస్ఎఫ్, సింగరేణి టీమ్ లు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. వారికి ఎస్కేప్ ఎగ్జిట్ వద్ద రెండు డెడ్ బాడీలు కనిపించాయి. మరో గంటకు మరో డెడ్ బాడీ అటు తర్వాత ఇంకో రెండు డెడ్ బాడీలు ఇలా సాయంత్రం 6 గంటల వరకు తొమ్మిది డెడ్ బాడీలను రెస్క్యూ టీమ్ లు బయటకు తీసుకువచ్చాయి. లోపల చిక్కుకున్న ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఈ సంఘటన దృష్ట్యా అందరూ దిగ్బ్రాంతికి లోనయ్యారు.